BRO: పవన్ కళ్యాణ్ అభిమానులు అసంతృప్తి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తోన్న బ్రో సినిమాపై ఎంత మంచి బజ్ ఉందొ అందరికి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాలో మొదటిసారి మెగా మేన అల్లుడు సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారు. ఇటీవలనే షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా ఈ నెల 28న గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది.

ఇక ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాకు మంచి ప్లస్ అయింది. మార్కెట్ లో ఈ సినిమా భారీగా బిజినెస్ జరుపుకుంటున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఈ సినిమా ఆడియో సాంగ్స్ తో కూడా సందడి చేయడానికి రెడీ అయింది. థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా ఈ సినిమాలోని మొదటి పాటను కాసేపటి క్రితం విడుదల చేసారు. మై డియర్ మార్కండేయ పేరుతో రిలీజైన ఈ సాంగ్, పీకే కెరీర్ లోనే వరెస్ట్ సాంగ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు.

పవన్ కళ్యాణ్ సినిమాల రిజల్ట్ పక్కన పెడితే ఆయన మూవీస్ లో సాంగ్స్ మాత్రం ఒక ఎనర్జీతో, మంచి పిచ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. కానీ ఈ మై డియర్ మార్కండేయ సాంగ్ మాత్రం అసలు ఇసుమంతమైన ఆకట్టుకునే విధంగా లేదు. పైగా ఈ సాంగ్ లో కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి, ఊర్వశి రౌతేలను పెట్టారు. కానీ తీరా చూస్తే ఆమెకి అసలు స్క్రీన్ స్పెసే లేనట్టు తెలుస్తుంది. ఆ మాత్రం దానికి ఈమెని ఎందుకు తీసుకున్నారో గురూజీ అండ్ బ్యాచ్ కె తెలియాలి. ప్రొడ్యూసర్స్ కొంపలు ముందే పనే తప్ప ఏమి ఉపయోగం లేదనే చెప్పాలి.

- Advertisement -

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ ఒకే పాటలో కనిపిస్తున్నారంటే, వాళ్ళిద్దరి ఫ్యాన్స్ కు ట్రీట్ అనిపించేలా సాంగ్ కంపొజిషన్ ఉండాలి. కానీ ఈ సాంగ్ చూస్తే కంప్లిట్ గా పేలవంగ ఉండి. ఏమాత్రం ఆసక్తి కరంగా లేకుండా ఉంది. మోషన్ పోస్టర్ కి అద్భుతంగా మ్యూజిక్ అందించిన థమన్ ఇంత వరెస్ట్ సాంగ్ ఇస్తాడని అనుకోలేదని పీకే ఫ్యాన్స్ సోషల్ మీడియా కామెంట్స్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు