Rangasthalam: జపాన్లో రీ సౌండ్ కు రెడీ అవుతున్న గ్లోబల్ స్టార్ సినిమా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి జపాన్ లో ఫ్యాన్ బేస్ అంత కంతకీ పెరిగిపోతుంది. మగధీర సినిమా తో జపాన్ ప్రేక్షకులకి చేరువైన రామ్ చరణ్, ఆ తర్వాత RRR సక్సెస్ తో అప్పటికే ఉన్న ఫాలోయింగ్ కన్నా మరింత స్థాయిలో అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు . ఇక లేటెస్ట్ గా అయితే చరణ్ న్సటించిన మరో సినిమా జపాన్ లో విడుదల అవడానికి సిద్ధంగా ఉంది. చరణ్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా “రంగస్థలం” టాలీవుడ్ లో ఎన్నో రికార్డులు సృష్టించి నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది. అంతే కాదు రామ్ చరణ్ ని నటన పరంగా మరో మెట్టు ఎక్కేలా చేసింది ఈ సినిమా. ఇటీవల రంగస్థలం సినిమా మార్చి 30 తో 5ఏళ్ళు పూర్తి చేసుకుంది.

ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. అక్కడ ఫేమస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ “స్పేస్ బాక్స్” రంగస్థలం సినిమా ని రిలీజ్ చేయనున్నారు.అయితే ఏప్రిల్ 9,10,11 తేదీలలో ఈ సినిమాకి అక్కడ స్పెషల్ షోస్ ప్లాన్ చేయబడ్డాయి. మరి మన తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇప్పుడు జపాన్ లో చరణ్ సినిమాకి స్పెషల్ షోస్ వేస్తుండడం చరణ్ అభిమానులకి ఆనందాన్నిస్తుంది.

ఏది ఏమయినా మన దగ్గర దద్దరిల్లిపోయే రీ సౌండ్ చేసిన చిట్టిబాబు మరి జపాన్ లో ఏం చేస్తాడో చూడాలి. ఇప్పటికి అక్కడ RRR సినిమా అద్భుతమైన వసూళ్లు సాధిస్తుంది. మరి ఈ సినిమా కూడా అక్కడ అలంటి హిట్ గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక “రంగస్థలం” సినిమాని సుకుమార్ దర్శకత్వం వహించగా, ఇందులో సమంత హీరోయిన్ గా నటించింది. అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు