Veera Simha Reddy: రికార్డ్ స్థాయి కలెక్షన్లతో..

అఖండ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ, తాజాగా గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో నటించిన లెటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ”వీర సింహ రెడ్డి’‘. ఈ సినిమాలో శృతి హాసన్, హనీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి స్టార్స్ కుడా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందించాడు.

తాజా గా ఈ సినిమా సంక్రాంతి కనుక గా 12వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి రోజు నుంచి మిశ్రమ టాక్ తెచ్చుకుంది. బాలయ్య యాక్షన్ మరియు డాన్స్ తో, శృతి హాసన్ క్యూట్నెస్ మరియు బ్యూటీ తో, తమన్ మ్యూజిక్ తో , వరలక్ష్మి శరత్ కుమార్  స్టన్నింగ్ యాక్టింగ్ తో ప్రేక్షకులని కట్టి పడేసారు. ఇందులో, తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మూవీ కి ప్లస్ పాయింట్ అయింది.

కాగా మొదటి షో నుంచే మిశ్రమ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఒపెనింగ్స్ ను మాత్రం భారీగా తెచ్చుకుంది. 110 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తొలి రోజు 54 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. దీనికి సంబంధించి ఓ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాక్సాఫీస్ ఊచకోత అనే క్యాప్షన్ తో పోస్టర్ ఉంది. కాగా తొలి రోజే 54 కోట్ల గ్రాస్ రావడం నందమూరి నటసింహ కెరీర్ లోనే ఇదే తొలిసారి. ఈ చిత్రం మరిన్నీ కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉంది.

- Advertisement -

కాగా నేడు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య విడుదలైంది. ఈ చిత్రం ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇది వీరసింహా రెడ్డి కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు