Janhvi Kapoor: కోలీవుడ్ ఎంట్రీకి బ్రేకులు..

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైంది జాన్వి కపూర్. ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. చేసిన సినిమాలు కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. అయినా, ఈమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. జాన్వి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంది. అలాగే తన ఘాటు అందాలను కూడా షేర్ చేస్తుంది. దీంతో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకుంది.

ధడక్ తో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే బాలీవుడ్ లో పలు చిత్రాలు చేసిన ఈ బ్యూటీ దక్షిణాది చిత్రాలలో నటించాలని చాలా కాలంగా కోరుకుంటుంది. అలాగే తనకి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో నటించాలని ఉందంటూ పలుమార్లు చెప్పిన విషయం కూడా తెలిసిందే. కానీ ఇప్పటివరకు జాన్వి దక్షిణాదిలో నటించనేలేదు. తాజాగా ఈ బ్యూటీ కోలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి.

లింగు స్వామి దర్శకత్వంలో 2010 సంవత్సరంలో కార్తీ, తమన్నా జంటగా తెరకెక్కించిన పయ్యా (ఆవారా) సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించేందుకు లింగుస్వామి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీక్వెల్ లో హీరోగా ఆర్య, హీరోయిన్ గా జాన్వి కపూర్ నటించబోతుంది అంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రచారంపై జాన్వి కపూర్ తండ్రి బోనీకపూర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

- Advertisement -

“ప్రియమైన మీడియా మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేయునది ఏమనగా జాన్వి కపూర్ ప్రస్తుతం ఎలాంటి తమిళ సినిమాని అంగీకరించలేదు. దయచేసి ఇలాంటి ఫాల్స్ రూమర్స్ ని ప్రచారం చేయకండి” అంటూ జాన్వి తమిళ ఎంట్రీ పై బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చారు. దీంతో సౌత్ సినిమాల్లో జాన్వీ కనిపించడానిక మరింత సమయం పట్టేలా ఉందని అభిమానులు నిరాశ చెందుతున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు