Nikhil siddharth : కార్తికేయ-3 మొదలవుతుంది !

2022 లో వచ్చిన బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ సినిమా కార్తికేయ2. చిన్న సినిమాగా 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 120 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. కార్తికేయ పార్ట్-1 రీజినల్ సినిమాగా రిలీజ్ అయ్యి, తెలుగులో మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా హిందీ డబ్ వెర్షన్ యూట్యూబ్ లో రిలీజ్ అయ్యాక మిలియన్ల వ్యూస్ సాధించింది. కార్తీకేయ2 సినిమా ఎనౌన్స్ చేసాక నార్త్ నుంచి సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేయండి అనే డిమాండ్ రావడంతో కార్తికేయ పార్ట్ 2ని ఇండియా వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేసారు. అందరు ఆశ్చర్యపోయే విధంగా సినిమా అతి పెద్ద విజయం సాధించింది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ప్రవాహాన్ని సృష్టించింది.

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా , చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ-2 బిగ్గెస్ట్ సక్సెస్ అవడంతో ఈ సినిమాని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు కార్తికేయ పార్ట్-3 చేసే ప్లానింగ్ లో ఉన్నట్టు ప్రొడ్యూసర్ టి.జి విశ్వ ప్రసాద్ చెప్పారు. అత్యంత తక్కువ సమయంలో 100 సినిమాలు నిర్మించిన ఫిలిం ప్రొడక్షన్ గా పేరు రావాలనే దిశగా వాళ్ళు పని చేస్తునట్టు అయన చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం నిఖిల్ స్పై అనే థ్రిల్లర్ సినిమా ఒకటి చేస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. ఇది నిఖిల్ చేస్తున్నసెకండ్ పాన్ ఇండియ సినిమా. ఈ సినిమా రిలీజ్ తరువాత కార్తికేయ 3 ని సంబంధించి వర్క్ స్టార్ట్ అయ్యేలా ఉంది. చందు మొండేటి కూడా ప్రస్తుతం వేరే సినిమాకి సంబంధించిన పనిలో బిజీ గా ఉన్నారు. అయితే ఆయన తమిళ్ హీరో సూర్యకి కథ వినిపించారనే వార్త వినిపిస్తోంది. సూర్య ఇచ్చే రెస్పాన్స్ ని బట్టి చందు మొండేటి కార్తికేయ 3 చేస్తాడా , లేక వేరే సినిమా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు