Kollywood: ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో భారీ చోరి

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భార్య ఐశ్వర్య నివాసంలో భారీ చోరి చోటు చేసుకుంది. ఈ చోరీలో ఐశ్వర్య ఇంట్లో ఉన్న 60 సవర్ల బంగారు నగలు మాయం అయినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన ఫిబ్రవరి 27న జరిగిందట. తాజాగా ఈ చోరి విషయం బయటకు వచ్చింది. కాగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుతూరు ఐశ్వర్య ప్రస్తుతం చెన్నైలో తేనాంపేటలోని సెయింట్ మేరీస్ రోడ్‌లోని తన నివాసంలో నివసిస్తోంది.

అయితే తన ఇంట్లోని లాకర్ లో నుండి భారీగా చోరీ జరిగిందని ఫిబ్రవరి 27న తేనాంపేట పోలీస్ స్టేషన్ లోని ఫిర్యాదు చేసింది. కానీ ఈ విషయం చాలా ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఐశ్వర్య ఫిర్యాదులో పేర్కొన్నది ఏంటంటే, లాకర్ లోని 60 సవర్ల నగలు మాయమైనట్లు చెప్పింది. 2019 లో తన చెల్లి సౌందర్య రజినీకాంత్ పెళ్ళికి తాను ధరించిన నగలు అన్ని కూడా అదే లాకర్ లో పెట్టినట్టు, ఇప్పటికి తాను మూడు సార్లు ఇల్లు మారిన, ఈ నాలుగేళ్లలో ఆ లాకర్ ని ఒక్కసారి కూడా అసలు వాటిని ఓపెన్ చెయ్యలేదని, ఈ కొత్త ఇంటికి వచ్చాక అది ఓపెన్ చేసి చూస్తే అందులో నగలు కనిపించలేదని ఐశ్వర్య పేర్కొంది.

అలాగే తన ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురు పనివాళ్లకి ఆ నగలు లాకర్ లో ఉన్న విషయమే కాకుండా, వాటి తాళాలు ఎక్కడ భద్రపరిచానో కూడా తెలుసు అని ఫిర్యాదులో ఐశ్వర్య చెప్పింది. వాళ్ళ ముగ్గురి మీద తనకి అవమానం ఉన్నట్లు ఐశ్వర్య తన ఫిర్యాదు లో పేర్కొంది అని తెలిసింది.

- Advertisement -

కాగా ఐశ్వర్య, ధనుష్ మధ్య ఇటీవల విడాకుల గురించి అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తమకు డైవర్స్ కావాలని ఈ ఇద్దరు కోర్టు మెట్లు ఎక్కారు. తర్వాత రజినీకాంత్ ఇద్దరికి సర్ధిచెప్పడంతో డైవర్స్ క్యాన్సిల్ అయినట్టు సమాచారం. ఈ వ్యవహారం తర్వాత ఐశ్వర్య ఈ చోరి ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచింది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు