Tollywood: “ఉప్పెన”లా దూసుకొచ్చిన కృతి శెట్టి కెరీర్ ఆమె వల్లే నాశనం అవుతుందా..?

హీరోయిన్ కృతి శెట్టి గురించి తెలియని వారు ఉండరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు యాడ్స్ ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈమె.. ఆ తరువాత తెలుగులో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి చిత్రం “ఉప్పెన” సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ వెంటనే శ్యామ్ సింగారాయ్, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. కెరియర్ ఆరంభంలోనే వరుసగా మూడు హిట్స్ పడడంతో కృతి శెట్టిని గోల్డెన్ లెగ్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఇక కృతి శెట్టి కెరీర్ కి ఏ మాత్రం డోకా లేదు అనుకున్నారు సినీ జనాలు. ఈ సమయంలోనే కృతి శెట్టికి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగిలింది. వరుస సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడం స్టార్ట్ అయింది.

కథల సెలక్షన్, ఏ హీరోల సినిమాలు చేయాలి అనే విషయంలో ఇండస్ట్రీకి క్లారిటీ ఇవ్వలేక పోయింది. అయితే ఈ బ్యూటీ కెరీర్ ఇలా అవ్వడానికి కారణం ఏంటన్న దానిపై సినిమా సర్కిల్స్ లో ఓ ఆసక్తికరమైన ప్రచారం జరుగుతుంది. కృతి శెట్టి తన తల్లి కారణంగానే సినిమాల విషయంలో వెనకపడుతుందన్న టాక్ వినిపిస్తుంది. కృతి శెట్టి సినిమా కథల ఎంపిక విషయంలో ఆమె తల్లి నీతిశెట్టి కలగజేసుకుంటున్నారట. కృతి శెట్టి కి కథ వినిపించడానికి ఎవరైనా వెళ్ళినప్పుడు కృతితో పాటు ఆమె తల్లి కూడా వింటున్నారట. ఆమెకి కథ నచ్చితేనే సినిమా చేయడానికి ఒప్పుకుంటున్నారట. అలా కృతి శెట్టి తన తల్లి కారణంగానే చాలా సినిమాలను రిజెక్ట్ చేశారట. దీంతో కృతి శెట్టి జోరు తగ్గినట్టే అంటున్నారు సినిమా పండితులు.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు