ఆది పురుష్. ఇండియా లో మోస్ట్ అవైటెడ్ అప్ కమింగ్ మూవీస్ లో ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమా 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం. పూర్తిగా బాలీవుడ్ తారాగణం తో తెరకెక్కుతున్న ఈ సినిమా లో రాముడిగా ప్రభాస్, సీత గా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు.
ఈ మధ్యనే విడుదలైన ఆదిపురుష్ టీజర్ అంతగా ఆకట్టుకోలేకపోయినా మూవీ పై అంచనాలు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇక టీజర్ ద్వారా వచ్చిన విమర్శలకు చెక్ పెట్టడానికి చిత్ర యూనిట్ సినిమాలో చాలా భాగం రీ షూట్ చేస్తుంది. అంతే కాదు ఈ సినిమా గ్రాఫిక్స్ పైన కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. ఇక ఆది పురుష్ చిత్రాన్ని ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా రెట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్ అతుల్ మ్యూజిక్ అందించారు.
తాజాగా ఆదిపురుష్ చిత్ర యూనిట్ వారు సీత పాత్రకి సంబంధించి ఒక మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసారు. ఆ పోస్టర్ లో సీతగా కృతి సనన్ చాలా అద్భుతంగా కనిపించింది. నార చీర కలిగిన కాషాయ వస్త్రం తో వనవాసానికి వెళ్లే సీత గా ఆ స్టిల్ లో కనిపించింది. అయితే ఇంత వరకు చాలా తక్కువ మందికి ఇలాంటి మంచి పాత్రలు చేసే అవకాశం వచ్చింది. బాలీవుడ్ లో ఎన్నోఏళ్ల తర్వాత ఇలాంటి మైథలాజికల్ మూవీ వస్తుంది.
కృతి సనన్ కి నటిగా ఈ పాత్ర దొరకడం అదృష్టమని చెప్పాలి. ఎందుకంటే ఒకానొక సమయంలో తెలుగు లో శ్రీ రామ రాజ్యం లో సీత గా నటించిన నయనతారను ఎస్.పి బాలు సినిమాలు మానెయ్యమని చెప్పారు. ఎందుకంటే తాను ఇక మీదట ఎన్ని సినిమాలు చేసిన ఇంత మంచి పాత్ర రావడం కష్టం అన్నారు. ఈ పాత్ర కు భారతదేశంలో అంత విశిష్టత ఉంది. మరి ఈ సినిమాలో సీతగా కృతి సనన్ కనిపిస్తే సరిపోదు. అభినయించాలి. దానికి తన టాలెంట్ తో చాలా కృషి చేయాలి. అప్పుడు ఈ సినిమా కొంచెం క్లిక్ అయినా కృతి సనన్ పేరు మార్మోగిపోవడం ఖాయం. ఇక ఆది పురుష్ చిత్రం జూన్ 16 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.