Chiranjeevi: మొగిలయ్యకు మెగాస్టార్ సాయం..!

‘బలగం మొగిలయ్య’ ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. బలగం సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే భావోద్వేగభరిత పాటతో ప్రసిద్ధి చెందిన ఈ జానపద కళాకారుడు కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో హాస్పిటల్లో చేరాడు. రెండు కిడ్నీలు పాడటంతో సమస్య తీవ్రమై మొగిలయ్య పరిస్థితి విషమంగా మారింది. ఈ సమస్య కంటిచూపు పై కూడా ప్రభావం చూపిందని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి కంటికి సంబంధించి సర్జరీ అవసరం అయ్యే ఖర్చు తానే భరిస్తానని హామీ ఇచ్చారట. బలగం డైరెక్టర్ వేణుతో ఫోన్లో  మొగిలయ్య సమస్య గురించి చర్చించిన చిరంజీవి ఈ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మొగిలయ్య దంపతులు ఈ విషయం వెల్లడించారు. చిరంజీవి సాయం అందిస్తానని చెప్పినట్టు తమకు వేణు తెలియజేసాడని అన్నారు. మొగిలయ్యకు చిరంజీవి సాయం చేసేందుకు ముందుకు రావటంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎవరికీ ఎలాంటి సమస్య వచ్చినా సాయం అందేది మొదటగా చిరంజీవి నుండే అని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా టాలీవుడ్ కి పెద్ద దిక్కు చిరంజీవి ఒక్కడే అని అంటున్నారు. కరోనా సమయంలో ఎంతో మంది టెక్నీషియన్లను జూనియర్ ఆర్టిస్టులను ఆదుకున్నారు చిరంజీవి.
ప్రస్తుతం మొగిలయ్య కిడ్ని సమస్యకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరపున నిమ్స్ హాస్పిటల్ లో మెరుగైన వైద్యం అందుతోంది. మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతో మెరుగైన వైద్యం అందుకుంటున్న మొగిలయ్యకు డయాబెటిస్ వల్ల కంటి చూపు మందగించినట్లు డాక్టర్లు తెలిపారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు