Dead pixels : నిహారిక, చైతన్య మధ్య విభేదాలకి ఇదే కారణమా !

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ డాన్స్ షోతో బుల్లి తెరకి యాంకర్ గా పరిచయమైంది. ఆ తరువాత ఆమె యాక్టింగ్ పై ఆసక్తి తో “ఒక మనసు” సినిమాతో వెండి తెరకి హీరోయిన్ గా పరిచయమైంది. నాగ శౌర్య హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తరువాత నిహారిక, విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ఒక తమిళ్ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించింది. ఈ సినిమాని తెలుగులో ” ఒక మంచి రోజు చూసి చెప్తా ”  అనే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. ఆ తరువాత నిహారిక చేతికందిన సినిమాలు చేస్తూపోయింది.

అయితే నిహారిక 2020 లో చైతన్య ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత సినిమాలకి కంప్లిట్ గా గుడ్ బై చెప్పిన నిహారిక ప్రొడ్యూసర్ గా సెటిల్ అయింది. అయితే గత కొద్దిరోజులుగా ఫ్యామిలీ గొడవల కారణంగా భర్త చైతన్యతో దూరంగా ఉంటుంది. అయితే ఈ గొడవలకి కారణం తాను మళ్ళి సినిమాల్లో నటించడమే అని వార్తలు వచ్చాయి.నిహారిక సినిమాలు చేయను అని ప్రామిస్ చేసిన తరువాతనే చైతన్య నిహారికాని పెళ్లి చేసుకున్నడంట కానీ ఆమె మళ్ళీ సినిమాలు చేస్తాను అని చెప్పడంతో గొడవలై కొద్దిరోజులుగా వీళ్లిద్దరు దూరంగా ఉంటున్నారు. ఇద్దరు డైవర్స్ తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చిన దీనిపై మెగా ఫ్యామిలీ ఎవరు స్పందించలేదు.

అయితే నిహారిక ప్రస్తుతం డిస్ని హాట్ స్టార్ లో డెడ్ పిక్సల్స్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ సిరీస్ కి సంబందించిన టీజర్ మంగళవారం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. గేమింగ్ నేపథ్యంలో ఈ సిరీస్ ఉండబోతుంది అని టీజర్ ద్వారా తెలుస్తుంది. అయితే ఈ సిరీస్ లో యాక్టింగ్ చేయడం కారణంగానే చైతన్యతో విబేధాలువచ్చాయేమో అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ సిరిస్ మే 19 నుంచి స్ట్రీమ్ అవబోతుంది. వైవా హర్ష, రాజీవ్ కనకాల ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు