pushpa 2: సెట్ లోకి వచ్చేసిన అల్లు అర్జున్.

స్టార్ డైరెక్టర్ సుకుమార్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో “తెరకెక్కిన పుష్ప ది రైజ్” చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఈ నేపథ్యంలో పుష్ప 2 ( ది రూల్) అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇటీవల హైదరాబాద్ లో కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా మరికొంత భాగాన్ని చిత్రీకరించేందుకు మూవీ యూనిట్ విశాఖపట్నం చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురువారం రాత్రి వైజాగ్ చేరుకున్నారు. గురువారం రాత్రి 10 గంటలకు ఇండిగో విమానంలో హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న అల్లు అర్జున్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు అభిమానులు.

అల్లు అర్జున్ తో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఎయిర్ పోర్టు నుండి నోవాటేల్ వరకు అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లారు అల్లు అర్జున్. ఇక ఈ మూవీ షూటింగ్ నేటి నుండి ( శుక్రవారం) పది రోజులపాటు విశాఖ పరిసర ప్రాంతాలలో జరగనుందని సమాచారం. విశాఖ, మారేడుమిల్లి, అరకులోయ వంటి అటవీ ప్రాంతాలలో ఈ మూవీ షూటింగ్ లో అల్లు అర్జున్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇక ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సహా సుకుమార్ లు సంయుక్తంగా ఈ సినిమాకి నిర్మాణం వహిస్తున్నారు. ఫిబ్రవరిలో రష్మిక ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతుందని సమాచారం.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు