Pushpa: రష్మికకు బిగ్ షాక్ ఇచ్చిన సుకుమార్ ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్ ఉత్తరాదిని ఊపేశాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా వినిపించాయి. ఈ చిత్రం రూ. 350 కోట్లను వసూళ్లు చేసి అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కేవలం అల్లు అర్జున్ కే కాదు.. హీరోయిన్ గా చేసిన రష్మిక మందన్నా కెరీర్ కు కూడా బాగా ఉపయోగపడింది.

ఈమె పుష్పలో శ్రీవల్లీ అనే పాత్ర చేసిన సంగతి విధితమే. ఇందులో రష్మిక నటనకు, డ్యాన్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. సినిమాలో శ్రీవల్లి పాత్రకు మంచి స్కోప్ ఉంది. దీంతో రష్మిక తన ఫర్మామెన్స్ తో రెచ్చిపోయింది. ఇది ఇలా ఉండగా, పుష్ప2 లో హీరోయిన్ గా రష్మికనే ఉంటుందని తెలుస్తోంది. పుష్ప 1 విజయంతో పుష్ప2 పై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు పెరిగాయి. రెండో పార్ట్ విడుదల అవుతే, భారీ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుంది. అందుకే డైరెక్టర్ సుకుమార్ కూడా పుష్ప రెండో పార్ట్ కోసం పకడ్భందీగా ప్లాన్ చేస్తున్నాడు.

ఈ క్రమంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు గట్టి షాక్ తగిలినట్టు తెలుస్తోంది. మొదటి పార్ట్ లో ఎక్కువ సమయం స్క్రీన్ పై కనిపించిన రష్మికకు రెండో పార్ట్ లో నిరాశ తప్పదని తెలుస్తోంది. పుష్ప2 లో కొత్తగా చాలా పాత్రలను దర్శకుడు సుకుమార్ పరిచయం చేయబోతున్నాడట. దీంతో రష్మిక పాత్రకు ప్రాధాన్యత తక్కువగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. సినిమాలో శ్రీవల్లి పాత్ర నిడివి కూడా తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది.

- Advertisement -

సినిమా మొత్తం అల్లు అర్జున్ పాత్ర చుట్టునే తిరుగుతుందని టాలీవుడ్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. అలాగే రెండో పార్ట్ లో ఇతర భాషల నుంచి స్టార్ నటులను తీసుకోబోతున్నారట. ఆ పాత్రలకు కూడా సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. దీంతో రష్మిక చేస్తున్న శ్రీవల్లి పాత్రకు అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని భోగట్ట. అయితే ఇది నిజమో కాదో తెలియాలంటే సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు