మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన కొత్త చిత్రం విరూపాక్ష. కార్తిక్ దండు అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇతను ఇంతకు ముందు జవాన్, భమ్ బోలేనాథ్, కార్తికేయ సినిమా లకు రైటర్ గా పని చేశాడు. దర్శకుడిగా మాత్రం విరూపాక్ష తొలి సినిమా.
అయితే ఈ సినిమా కి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రచన సహకారం అందించడం విశేషం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత ఈ మూవీ చేశాడు. రిపబ్లిక్ సినిమా తర్వాత వస్తున్న సినిమా ఇది. ఈ మధ్యే విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఏప్రిల్ 16 న ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేశారు. అయితే విరూపాక్ష కి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ని చిత్ర యూనిట్ నుంచి వచ్చింది.
విరూపాక్ష మూవీ యొక్క ఆఫిషియల్ ట్రైలర్ ని ఏప్రిల్ 11 న ఉదయం 11.07 గంటలకి విడుదల చేస్తున్నామని ప్రకటించారు. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన విరూపాక్ష ఏప్రిల్ 21 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News