Tollywood: మెగా హీరో కొత్త మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన కొత్త చిత్రం విరూపాక్ష. కార్తిక్ దండు అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇతను ఇంతకు ముందు జవాన్, భమ్ బోలేనాథ్, కార్తికేయ సినిమా లకు రైటర్ గా పని చేశాడు. దర్శకుడిగా మాత్రం విరూపాక్ష తొలి సినిమా.

అయితే ఈ సినిమా కి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రచన సహకారం అందించడం విశేషం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత ఈ మూవీ చేశాడు. రిపబ్లిక్ సినిమా తర్వాత వస్తున్న సినిమా ఇది. ఈ మధ్యే విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఏప్రిల్ 16 న ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేశారు. అయితే విరూపాక్ష కి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ని చిత్ర యూనిట్ నుంచి వచ్చింది.

- Advertisement -

విరూపాక్ష మూవీ యొక్క ఆఫిషియల్ ట్రైలర్ ని ఏప్రిల్ 11 న ఉదయం 11.07 గంటలకి విడుదల చేస్తున్నామని ప్రకటించారు. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన విరూపాక్ష ఏప్రిల్ 21 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు