Sharwanand :ఓ సినిమా అంత బడ్జెట్‌తో టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి

టైర్ 2 హీరోల్లో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోల లిస్ట్ లో ముందు వరుసలో ఉండే హీరో.. శర్వానంద్. విభిన్నమైన కథలను ఎంచుకుని, విజయాలు అపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంటాడు శర్వ. అయితే శర్వానంద్ కు తెలంగాణ హైకోర్ట్ న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డితో ఎంగేజ్‌మెంట్ జరిగిందన్న సంగతి విధితమే. అయితే నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి గురించి వార్తలు రాకపోవడంతో, ఈ జంట విడిపోయిందంటూ వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో శర్వానంద్ సన్నిహితులు స్పందించి, శర్వ పెళ్లి జూన్ 2 లేదా 3వ తేదీల్లో ఉంటుందని చెప్పి ఓ క్లారిటీ ఇచ్చారు. దీని తర్వాత పెళ్లి గురించి మరిన్నీ వివరాలు బయటకు వచ్చాయి. వీరిది డెస్టినేషన్ వెడ్డింగ్ గా ప్లాన్ చేశారని, రాజస్థాన్ లోని ఎంతో ప్రాముఖ్యమైన లీలా ప్యాలెస్ లో శర్వ-రక్షితల పెళ్లి జరుగుతుందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ పెళ్లి బడ్జెట్ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అంతే కాదు, ఇండస్ట్రీలో అందరినీ షాక్ కు గురి చేస్తుంది.

ఎందుకంటే, శర్వానంద్-రక్షిత పెళ్లి నాడు 4 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇదే నిజమని పక్కా సమాచారం అందుతుంది. లీలా ప్యాలేస్ అంటే మినిమం 4 కోట్లు ఖర్చు చేయాల్సిందేనట. రెండు రోజుల పాటు జరిగే పెళ్లి వేడుకలో మెహందీ, సంగీత్, హల్దీ ఫంక్షన్స్ ను కూడా గ్రాండ్ గా ప్లాన్ చేశారట. వీటితో పాటు పెళ్లికి సంబంధించి బట్టలు, నగలు, విందుతో పాటు మరికొన్ని ఏర్పాట్లుకు మరింత ఖర్చు అయ్యే ఛాన్స్ ఉందని గుస గుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇందంతా చూస్తే, జీవితంలో ఒకేసారి జరిగే పెళ్ళి వేడుకను శర్వానంద్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశాడని అర్థమవుతుంది. కాగా ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ నుంచి నాగార్జున, బాలయ్య, రామ్ చరణ్ తో పాటు పలువురు టాప్ హీరోలు హాజరవుతారని తెలుస్తుంది. కాగా, మెగాస్టార్ ఫ్యామిలీకి శర్వానంద్ కు ఉన్న సన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఫ్యామిలీతో తప్పకుండా హాజరయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు