SSMB28: త్రివిక్రమ్ ను వెంటాడుతున్న మూడో సెంటిమెంట్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలవైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ తర్వాత మూడేళ్లు విరామం తీసుకుని చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. ఇంకా టైటిల్ నిర్ణయించని సినిమాకు వర్కింగ్ టైటిల్ ssmb28 గానే ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యనే రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న సినిమా సంక్రాంతి కానుక గా 2024 జనవరి 13న విడుదల అవ్వడానికి రెడీ అవుతుంది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. త్రివిక్రమ్ తో పూజా కి ఇది మూడో సినిమా కావడంతో వీళ్ళ కాంబినేషన్ పై గాసిప్స్ రచ్చ చేస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తుండగా థమన్ కి కూడా త్రివిక్రమ్ తో మూడో సినిమా కావడం విశేషం. అలాగే మహేష్ బాబు తోనూ త్రివిక్రమ్ కి మూడో సినిమా. ఇలా మూడో సెంటిమెంట్ తో కలిసి వచ్చినా ఒక బ్యాడ్ సెంటిమెంట్ మాత్రం అభిమానులను రివర్స్ లో కంగారు పడుతుంది.

వివరాల్లోకి వెళితే త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబో లో వచ్చిన మూడో సినిమా అజ్ఞాతవాసి ఎంత డిసాస్టర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మహేష్ తో చేస్తున్న సినిమా కూడా మూడోది కావడం తో ఈ మూడో సినిమా సెంటిమెంట్ మళ్ళి రిపీట్ అవుతుందని మహేష్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే త్రివిక్రమ్ ఫ్యాన్స్ మాత్రం దీనికి వేరేలా బదులిస్తున్నారు. అదేంటంటే అల్లు అర్జున్ తో కూడా మూడు సినిమాలు చేయాగా మూడో సినిమా అలవైకుంఠపురంలో ఘన విజయం సాధించింది. కాబట్టి ఇప్పుడు మహేష్ సినిమా కూడా హిట్ అవుతుందంటున్నారు. ఈ రెండు సెంటిమెంట్లలో ఏది నిజమవుతుందో తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు