Vijay Deverakonda: డైలామోలో రౌడీ హీరో

లైగర్ ఫలితం తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రతి అడుగు ఆలోచించి వేస్తున్నాడు. దీని తర్వాత ఎక్కువ సమయాన్ని వృథా చేయకుండా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాను స్టార్ట్ చేశాడు. కానీ సమంత అనారోగ్య సమస్యల వల్ల ఈ చిత్రం షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. దీంతో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయడం లేదు. దీంతో తన తర్వాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.

అందులో భాగంగా తనకు గీతా గోవిందం లాంటి బిగ్ హిట్ ఇచ్చిన పరుశురామ్ తో ఒక కథను ఒకే చేసుకున్నాడు. పరుశురామ్ ఇప్పటికే విజయ్ కి భారీ హిట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ సెంటిమెంట్ ను వర్కౌట్ చేస్తూ.. ఖుషి తర్వాత ఈ చిత్రాన్నే లైన్ లో పెట్టాలని అనుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కన్నడ డైరెక్టర్ నర్తన్ కూడా విజయ్ దేవరకొండకు ఒక స్టోరీని వినిపించాడు. ఆ స్టోరీ విజయ్ కి కూడా విపరీతంగా నచ్చిందట. వెంటనే ఒకే కూడా చేశాడని టాక్. ఇది పాన్ ఇండియా సినిమాగా రాబోతుందని సమాచారం.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కన్నడ డైరెక్టర్స్ హవా నడుస్తుంది. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టిన సినిమాలకు ఎక్కువగా కన్నడ డైరెక్టర్సే ఉన్నారు. దీంతో ఈ కన్నడ డైరెక్టర్ తో పాన్ ఇండియా సినిమా చేయాలా? లేదా ఇప్పటికే కలిసొచ్చిన పరుశురామ్ తో కలిసి ముందుకు వెళ్లాలా? అనే డైలామోలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే సమంత కూడా ఆనారోగ్యం నుంచి కోలుకున్నట్టు తెలుస్తోంది. ఒక వేళ సమంత వస్తే.. ఈ రెండు ప్రాజెక్ట్ లకు పక్కన బెట్టి ఖుషి సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

For More Updates :
Grab Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు