Janhvi Kapoor: తల్లి స్థానాన్ని రీప్లేస్ చేస్తుందా ?

అతిలోక సుందరి శ్రీ దేవిని సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రైడ్ గా భావిస్తారు. చిన్న వయసులోనే సిల్వర్ స్క్రీన్ పై దర్శనమిచ్చిన ఈ అతిలోక సుందరి.. హీరోయిన్ గా.. స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడానికి ఎంతో సమయం తీసుకోలేదు. ఈ స్టార్ హీరోయిన్ కి తెలుగు పరిశ్రమకు మధ్య విడతీయలేని సంబంధం ఉంది. తెలుగు తెరకు శ్రీదేవి 1970లోనే బాల్య నటిగా పరిచయమైంది. అప్పటి నుంచి ఎన్నో వినోదాత్మక, ప్రయోగాత్మక సినిమాల్లో కనిపించి తెలుగు ఆడియన్స్ ను మెప్పించింది.. తనవైపునకు తిప్పుకుంది.

పదహారేళ్ళ వయసు, కార్తీక దీపం, ప్రేమాభిషేకం, ఆఖరి పోరాటం, జగదేక వీరుడు అతిలోక సుందరి, క్షణ క్షణం లాంటి ఆమె నటించిన ఎన్నో సినిమాలో చరిత్రలో మిగిలిపోయాయి. అలాగే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శ్రీ దేవి స్థానాన్ని పదిలం చేశాయి. అయితే శ్రీదేవి 2018లో ఆకస్మాతుగా మరణించింది.

శ్రీ దేవి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేదేవరు ? ఈ ప్రశ్నకు ఇంకా సమాధానం రాలేదు. అయితే ఇప్పుడు అందరి కళ్లు.. శ్రీ దేవి కూతురు జాన్వీ కపూర్ పై ఉన్నాయి. జాన్వీ కపూర్ చేసింది తక్కువ సినిమాలే అయినా, ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సైతం తీసిపోని విధంగా జాన్వీ కపూర్ ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఈ భామ ప్రస్తుతం తెలుగు తెరపైకి రావడానికి సిద్ధమైంది.

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న NTR30 సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తుంది అంటూ ఇప్పటి వరకు వచ్చిన వార్తలను నిజం చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. NTR30లో హీరోయిన్ జాన్వీ కపూర్ అంటూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

అయితే జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతుండటం చిన్న విషయం తెల్చివేయలేం. ఎందుకంటే, తెలుగు ప్రేక్షకులకు శ్రీ దేవి అంటే అపారమైన అభిమానం ఉంది. అలాంటి అభిమానం ఇప్పుడు జాన్వీ కపూర్ కి వస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు ఉండవు. దీనికి అనుగూణంగా NTR30 కూడా పాన్ ఇండియా కాన్సెప్ట్ తో రాబోతుంది. ఇది హిట్ అయితే, టాలీవుడ్ ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ స్థానం పదిలం చేసుకోవడానికి, దివంగత నటి శ్రీ దేవి స్థానాన్ని భర్తీ చేయడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు