Dj square: ప్రొడ్యూసర్ నాగ వంశీ అప్పుడలా.. ఇప్పుడిలా..

సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ ప్లాన్ లు ఎవ్వరికి అర్ధం కావట్లేదు. టాలీవుడ్ లో ఈయన మరో దిల్ రాజు లా అయ్యేలా ఉన్నాడు. అసలు విషయానికి వస్తే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ లో నాగ వంశీ కూడా ఒకరు. కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూనే, తన బాబాయ్ అయిన ప్రొడ్యూసర్ ఎస్. రాధా కృష్ణ సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా ఉంటాడు.

అయితే తాజాగా వచ్చిన ఒక మూవీ అప్డేట్ ని తెలుసుకొని సోషల్ మీడియా లో ఈయన మీద ట్రోల్స్ వేస్తున్నారు. గత సంవత్సరం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒకే నెలలో రెండు సినిమాలు వచ్చాయి. అవే డీజే టిల్లు, భీమ్లా నాయక్. అయితే ఈ రెండు సినిమాల్లో ముందుగా డీజే టిల్లు 2021 లోనే విడుదల అవ్వాల్సింది. 2021 నవంబర్ నుంచి పోస్ట్ పోన్ అవుతూ చివరికి 2022 ఫిబ్రవరి 12 న  విడుదల అయింది. అయితే దీనికి కేవలం రెండు వారాల గ్యాప్ తోనే ఫిబ్రవరి 25 న వీరి బ్యానర్ లో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ విడుదలైంది. ఈ రెండు సినిమాలు వేర్వేరు డేట్స్ లలో రావాల్సి ఉండగా వాయిదా పడుతూ ఫిబ్రవరి లో విడుదలయ్యాయి.

అయితే మళ్ళీ ఇలాంటి సందర్భమే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న SSMB28 మూవీ 2023 ఆగస్ట్ లో విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ఈ ఏకంగా 2024 సంక్రాంతికి షిఫ్ట్ చేసారు. అయితే ఇప్పుడు అదే ఆగస్ట్ నెలలో 15 న డీజే టిల్లు స్క్వేర్ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. గత సంవత్సరం భీమ్లా నాయక్, డీజే టిల్లు మూవీల రిలీజ్ డేట్స్ లో మార్పు జరిగినట్లే, ఇప్పుడు ssmb28, డీజే స్క్వేర్ మూవీలకు జరుగుతుంది.

- Advertisement -

అయితే ఆగస్ట్ 11 న విడుదలవుతున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాను ఈ సినిమా తట్టుకొని నిలబడగలదా, లేదా రిలీజ్ టైం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ పోస్టుపోన్ చేస్తారా అన్నది చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు