Tillu Square: అనుపమని కూడా ఇందులో అలాగే చూపిస్తారా?

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. 2022 లో వచ్చిన ఆ సినిమా నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. పెట్టిన పెట్టుబడికి మూడు రేట్లు లాభాల్ని ఆర్జించింది. విమల్ కృష్ణ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఆ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మించాడు. కాగా ఇప్పుడు ఆ సినిమాకు సిక్వెల్ గా “టిల్లు స్క్వేర్” వస్తుందన్న సంగతి తెలిసిందే.

డీజే టిల్లు విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా ఈ సీక్వెల్ ను మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలకు కథ అందించింది సిద్ధూయే కావడం విశేషం. ఈ సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే మొదటి పార్ట్ లో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి ని ఆ సినిమాలో కొంచెం నెగిటివ్ గా స్వార్ధంగా చూపించడం జరిగింది. మరీ ఈ సినీమాలో హీరోయిన్ పాత్ర అలాగే ఉంటుందా? లేదా క్యారెక్టరైజేషన్ చేంజ్ చేస్తారా అనేది కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఎందుకంటే నేహా శెట్టి ఇండస్ట్రీ కి పరిచయమయ్యే నాటికీ పెద్దగా పేరు లేదు. ఈ సినిమా తోనే తాను రాధికా గా ఫేమ్ సంపాదించింది. అందువల్ల ఆ పాత్ర నెగిటివ్ గా చూపించిన బాగుంది.

కానీ సాఫ్ట్ సినిమాలు చేసి మంచి నటిగా ఇప్పటికే గుర్తింపు ఉన్న అనుపమ ని ఈ సినిమాలో నెగిటివ్ గా చూపించగలరా? ఒక వేళ చూపిస్తే ఆడియన్స్ ఒప్పుకుంటారా? అని ట్రేడ్ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలియాలంటే ఆ చిత్ర యూనిటే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 15న థియేటర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు