Ram charan: ఆ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి ఇక సినిమాలు రావా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటు సినిమాల పరంగానే కాకుండా నిర్మాతగానూ మంచి సినిమాలు తీస్తాడన్న విషయం తెలిసిందే. కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ లో పలు విజయవంతమైన చిత్రాలు తీసిన రామ్ చరణ్ ప్రతుతం సినిమాలపై దృష్టి పెట్టారు. ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తరువాత శంకర్ డైరెక్షన్ లో “గేమ్ చేంజర్” లో నటిస్తున్న రామ్ చరణ్ ఆ తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్ నుంచి కొంత గ్యాప్ తీసుకున్న చరణ్ పలు కార్యక్రమాల్లోపాల్గొంటున్నాడు. రీసెంట్ గా కాశ్మీర్ లో జరిగిన జి20 సదస్సులో పాల్గొన్న రామ్ చరణ్ అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.

అయితే తాజాగా రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ కాకుండా మరో ప్రొడక్షన్ లో భాగస్వామిగా చేరారు. యూవీ క్రియేషన్స్ నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ మరియు రామ్ చరణ్ కలిసి “వి మెగా పిక్చర్స్” బ్యానర్ లో సినిమాలు తీస్తున్నామని రెండు రెండురోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ లో ఫస్ట్ మూవీ గా “ది ఇండియా గేట్” అనే పాన్ ఇండియా సినిమా రాబోతుండగా నిఖిల్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ తో ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు.

అయితే కొన్నేళ్లపాటు చిరంజీవి హీరోగా సినిమాలు నిర్మిస్తూ వచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు వేరే ప్రొడక్షన్స్ తో చేతులు కలపడం వల్ల తన సొంత బ్యానర్ అయిన కొణెదల ప్రొడక్షన్స్ లో సినిమాలు వస్తాయా లేదా అన్నది సందేహంగా మారింది. ఎందుకంటే ఈ బ్యానర్ లో వచ్చిన ఆచార్య డిజాస్టర్ తర్వాత వచ్చిన “గాడ్ ఫాదర్” కూడా బీలో యావరేజ్ గా మిగిలింది. ఇప్పటి వరకు ఈ బ్యానర్ లో మరో సినిమా అనౌన్స్ మెంట్ కూడా జరగలేదు. అందువల్ల మళ్ళీ ఈ బ్యానర్ లో సినిమా వస్తుందా లేదా అన్నది ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు కొణెదల ప్రొడక్షన్స్ లో మళ్ళీ సినిమా వస్తుందా లేదా అన్నది తెలియాలంటే రామ్ చరణే స్వయంగా చెప్పాల్సి ఉంటుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు