ఈమధ్య సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య కమ్యూనికేషన్ బాగా దగ్గరలో ఉంది. సోషల్ మీడియాలో రోజు ఏవో ఒక వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడో ఎక్కడో జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియోలను మరెక్కడో తాజాగా జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్ గా మారింది.
ఓ యువతిని పొలాల్లో కర్రలతో యువకులు గుడ్డును కొట్టినట్లు కొడుతున్నారు. ఆ దెబ్బలు తాళలేక ఆ యువతి కేకలు వేస్తూ ఏడుస్తుంది. అత్యంత పాశవీకంగా ఉన్న వీడియోని టొరంటో సన్ కాలమిస్ట్ తారీఖ్ ఫతాహ్ షేర్ చేశారు. భారతీయ సంస్కృతి, నాగరికతకు అవమానం అంటూ ఈ వీడియో పై ఆయన కామెంట్ చేశారు.
పెద్ద దుమారం రేపిన ఆ వీడియో పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో పై స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా స్పందించింది. “ఏంటి ఈ దారుణం. ఈ రాక్షసులకు గుణపాఠం చెప్పాలి. కారణం ఏదైనా వారి చర్యలు దారుణం. మనం ప్రతిసారి మానవత్వాన్ని మరిచిపోవడం చూసి బాధ కలుగుతుంది. ఇది అత్యంత బాధాకరం” అంటూ ట్వీట్ చేశారు కాజల్ అగర్వాల్. అంతేకాదు దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం ఈ వీడియోని షేర్ చేశారు. సంబంధిత దుర్మార్గులను పట్టుకొని చంపేయాలంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు. 2021 లో మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనను ఉత్తరప్రదేశ్లో జరిగిందంటూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ యూత్ కాంగ్రెస్ లీడర్ ఒకరు ఈ వీడియోను ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
WTF. These monsters need to be taught a lesson. No reason is a reason for such monstrosity 😨😡🤬 it’s saddening how we forget humanity every now and again. https://t.co/9viaOUXyZf
— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 4, 2023
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News