Raangi: త్రిష సినిమా ఓటిటి కి రెడీ

త్రిష కథానాయికగా నటించిన చివరి చిత్రం ‘రాంగి’. ‘ఎంకే ఈపోతుం’ సినిమాతో మంచి హిట్‌ కొట్టిన ఎం శరవణన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.థియేటర్ల లో రిలీజైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది.

‘రాంగి’ కంటే ముందు త్రిష ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్‘. ప్రముఖ రచయిత కల్కి రచించిన ప్రపంచ ప్రసిద్ధ చారిత్రక నవల ఆధారంగా మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియిన్ సెల్వన్’ భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో త్రిష ‘కుందవి’ అనే యువరాణి పాత్రను పోషించింది.

త్రిషతో పాటు విక్రమ్, జయం రవి, కార్తీ, రెహమాన్, ప్రభు, శరత్ కుమార్, జయరామ్, ప్రకాష్ రాజ్, లాల్, విక్రమ్ ప్రభు, పార్తీపన్, బాబు ఆంటోని, అశ్విన్ కాకుమాను, రియాజ్ ఖాన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, శోభితా దూళిపాళ, జయచిత్ర తదితరులు నటించారు. సినిమా లో. విక్రమ్ ‘ఆదిత్య కరికాలన్’ పాత్రలో నటించాడు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించారు.

- Advertisement -

పొన్నియన్ సెల్వన్ తరువాత త్రిష నటించిన ‘రాంగి’ చిత్రం OTT విడుదలను ప్రకటించారు.జనవరి 29 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథకు ఎం శరవణన్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు. శక్తి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. ‘రాంకీ’ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు