Tollywood: ప్రమోషన్స్ తో జోరుమీదున్న రామబాణం టీమ్

మాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం రామబాణం. శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు వీరి కలయిక లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో రామబాణం పై భారీ అంచనాలున్నాయి. రామబాణం చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై TG విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల నిర్మించగా, మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసాయి.

ఈ సినిమా లో డింపుల్ హయతి హీరోయిన్ గా నటించగా జగపతి బాబు, ఖుష్బూ, నాజర్, శుభలేఖ సుధాకర్, అలీ, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శీను తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక రామబాణం రిలీజ్ టైమ్ కూడా దగ్గర పడుతుండడం తో ప్రమోషన్ జోరు పెంచారు చిత్ర యూనిట్. ఒక్కో పాటని రిలీజ్ చేస్తూ సోషల్ మీడియా లో హైప్ పెంచేయగా, ఇప్పుడు టెలివిజన్ లో కూడా ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. రీసెంట్ గా యాంకర్ సుమ నిర్వహించే ఓ షో లో రామబాణం మూవీ టీమ్ పాల్గొన్నారు.

ఇక ఏప్రిల్ 26 న రామబాణం చిత్ర యూనిట్ తో కలిసి గోపీచంద్ తన ఫ్యాన్స్ ను కలవనున్నారు. ఏప్రిల్ 26 న అమీర్ పేట్ లో సారథి స్టూడియోస్ దగ్గర మధ్యాహ్నం 3 గంటలకు అభిమానులను మీట్ కావడం జరుగుతుంది. ఇక రామబాణం చిత్రాన్ని మే 5 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు