టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న హీరోల్లో శర్వానంద్ ఒకడు. అయితే సినిమా ప్రమోషన్స్ లో గాని ప్రి రిలీజ్ ఈవెంట్ లలో గాని ఈ యంగ్ హీరోని ఎప్పుడు పెళ్లి గురించి అడిగిన, మాటా దాటేసి..పెళ్లి గురించి దాచేవాడు. అయితే శర్వానంద్ కి ఏమైనా లవ్ స్టోరీ ఉందేమో అందుకే అన్నీ విషయాలు దాస్తున్నడని అంత అనుకునేవాళ్లు .
అందరి అనుమానాలకి ఫుల్ స్టాప్ పెట్టేలా.. శర్వానంద్ సడన్ గా తన ప్రియురాలు రక్షిత రెడ్డి తో జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికి షాక్ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. అయితే శర్వానంద్ లవ్ చేసిన ఈ రక్షిత రెడ్డి ఎవరో కాదు. తెలంగాణ హై కోర్ట్ న్యాయవాదీ మధుసూదన్ రెడ్డి కూతురు.
అయితే రక్షిత రెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా వర్క్ చేస్తుంది. నిత్యం సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే శర్వానంద్, రక్షిత లకు పరిచయం, ప్రేమ ఎలా కుదిరాయనేది ప్రస్తుతానికి మిస్టరీనే.
ఇక విషయానికొస్తే శర్వానంద్, రక్షిత రెడ్డిల పెళ్లి నిన్న రాత్రి రాజస్థాన్ జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో బంధువుల, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకకి ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్, చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డెస్టినేషన్ వెడ్డింగ్ అవడం కారణంగా మిగితా సినీ పెద్దలు ఎవరు పెళ్ళికి అటెండ్ అవలేకపోయారు. జైపూర్ నుంచి హైదరాబాద్ కి ఈ కపుల్ రిటర్న్ అవ్వగానే అందరు సెలెబ్రెటీలను పిలిచి గ్రాండ్ గా ఫంక్షన్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి
ఇక శర్వానంద్ సినిమాల విషయానికొస్తే గత కొద్దీ రోజులుగా ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న శర్వానంద్ గతేడాది వచ్చిన ఒకే ఒక జీవితం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. తొందరలోనే ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ రానున్నాయి.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News