Aishwarya : ప్రిన్స్ సినిమాలో మాజీ విశ్వసుందరి ?

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ” సర్కారు వారి పాట ”. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ సాధించింది. దాని తరువాత సూపర్ స్టార్ మహేష్ ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 చిత్రంలో నటిస్తున్నాడు.

దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కి ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా ను తెలుగు తో పాటు హిందీ, తమిళ, కన్నడ మరియు మలయాళం భాషల్లో విడుదల చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమా ఢిల్లీ నేపథ్యంలో రాబోతున్న పొలిటికల్ డ్రామా అని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.

- Advertisement -

తాజాగా ఈ సినిమా లో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ఓ కీలక పాత్ర లో నటిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఈమెది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని, మహేష్- ఐశ్వర్య మధ్య డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ గాసిప్ మహేష్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అయింది. ఈ విషయం పై అధికారిక ప్రకటన రావాల్సిఉంది .శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 11న రిలీజ్ కి సిద్ధం అవుతుంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు