గత కొద్ది సంవత్సరాల నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న మధ్య ఏదో ఉన్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆన్ స్క్రీన్ ప్రేమ జంటగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఆఫ్ స్క్రీన్ లో ఎక్కడా కనిపించినా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చేస్తున్నాయి.
కానీ వీరు మాత్రం కేవలం మేము స్నేహితులమేనని తెలియజేస్తూ వస్తున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి మళ్ళీ దుబాయ్ టూర్ కి వెళ్లారని ఓ పుకార్ షికారు చేస్తుంది. విజయ్ దేవరకొండ తన కుటుంబంతో దుబాయ్ వెకేషన్ కి వెళుతుంటే రష్మిక కూడా వారితో జాయిన్ అయిందన్న ప్రచారం బలంగా ఉంది. విజయ్ దేవరకొండ తో సెల్ఫీ దిగడానికి ఒక అభిమాని ట్రై చేస్తుంటే మధ్యలో రష్మిక కూడా ఆ ఫోటోలో కనిపించేలా ఫోజ్ ఇస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనితో వీరిద్దరి పేర్లని కలిపి #virash గా ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్ .
అయితే వీరిద్దరూ ఏ కారణంగా దుబాయ్ కి వెళ్లారు అనేది తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు వీరిద్దరూ కెరియర్ పరంగా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. విజయ్ దేవరకొండ ఈ మధ్యన లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ని అందుకున్నాడు. రష్మిక కూడా బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించగా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
ఇక ఈ నెల రెండవ వారంలో రష్మిక పుష్ప 2 షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమాలో మాత్రమే నటిస్తున్నారు. అయితే విజయ్ – రష్మిక మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ పలు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వీరు మాత్రం ఇప్పటివరకు ఈ వార్తలపై సరైన క్లారిటీ ఇవ్వలేదు.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News