బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనోత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. సినిమా విషయం అయితేనేమి, రాజకీయం అయితేనేమి, మరోటైతేనేమి కంగనా చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే విషయంలోనూ, ఫ్యాషన్ గా ఉండే నటిగాను మీడియాలో ఎక్కువగా పాపులర్ అయ్యారు కంగనా. ఈమె ఇప్పటివరకు మూడు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు.
ఇక కంగనా ప్రస్తుతం “ఎమర్జెన్సీ” సినిమాలో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంగానా ఓ భావోద్వేగ లేఖను అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి తన ఆస్తులను తనఖా పెట్టాల్సి వచ్చిందని ఆ లేఖలో పేర్కొంది.
” నటిగా ఈరోజుతో ఎమర్జెన్సీని ముగించాను. నా జీవితంలో ఓ అద్భుత ఘట్టం పూర్తయింది. ఈ చిత్రంతో నా ప్రయాణం సాఫీగా జరిగిందని మీరు అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి నా ఆస్తులను తనఖా పెట్టాల్సి వచ్చింది. షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ సమయంలో నేను డెంగీ బారిన పడ్డాను. రక్త కణాల సంఖ్య పడిపోయింది. అయినప్పటికీ నేను షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో నా భావాలను చాలా స్వతంత్రంగా తెలుపుతున్నాను కాబట్టే ఈ విషయాలను ఇక్కడ షేర్ చేస్తున్నాను. నేను కిందకి పడిపోవాలని చాలామంది కోరుకుంటున్నారు. నన్ను బాధ పెట్టడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. అందుకే నా బాధ వల్ల వచ్చే ఆనందాన్ని వాళ్లకు ఇవ్వకూడదు అనుకున్న. ఇది నాకు పునర్జన్మ లాంటిది. కలలను నిజం చేసుకోవడానికి కష్టపడండి. ఈ సినిమా కోసం కష్టపడ్డ నా చిత్ర బృందానికి నా ధన్యవాదాలు” అని చెప్పింది కంగనా.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News