స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సెన్సేషనల్ పాన్ ఇండియన్ హిట్ మూవీ ‘పుష్ప: ది రైజ్’. 2021 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ చిత్రంలో సమంత రూత్ ప్రభు ‘ఊ అంటావా మావా ఊ ఊ అంటావా’ అంటూ ఐటెమ్ సాంగ్తో అదరగొట్టింది.
సినిమా విడుదలకు ముందే ఈ సాంగ్ దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. తన అందంతో పాటకే కొత్త ఊపు తీసుకొచ్చింది సమంత. ఈ పాటతో సమంత విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆమె డ్యాన్సుకు అభిమానులు ఓ రేంజిలో ఫిదా అయ్యారు. ‘పుష్ప’ చిత్రం అంత పెద్ద హిట్ సాధించడంలో సమంత పాట సైతం కీ రోల్ పోషించింది. ఈ పాట తర్వాత సమంతకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. పాన్ ఇండియా వ్యాప్తంగా ఆకట్టు కోవడంతో సామ్ కు బాలీవుడ్ లో సైతం వరుస ఆఫర్స్ అందుకుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా పుష్ప 2 సినిమా పనులు శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పుష్ప 2 లో కూడా ఐటమ్ సాంగ్ కోసం మూవీ యూనిట్ సమంతని కాంటాక్ట్ అయ్యిందని, కానీ ఈ ఆఫర్ ని సమంత రిజెక్ట్ చేసిందనే వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ రూమర్స్ పై సమంత టీం రియాక్ట్ అయింది. ఇందులో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. పుష్ప నిర్మాతలు సమంతని సంప్రదించలేదని తెలిపింది.
ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని సమంత టీం స్పష్టం చేసింది. ఇక సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ అనే ఆటో ఇమ్మూనిటీ డిసీజ్ నుంచి కోలుకుంటోంది. ‘యశోద’ చిత్రం తర్వాత కాస్త విరామం తీసుకున్న సామ్.. ఇంట్లోనే మయోసైటిస్కు చికిత్స తీసుకుంటూ కోలుకుంటోంది. తాజాగా తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్ సిరీస్ చిత్రీకరణలో పాల్గొంటోంది. మరికొన్ని రోజుల్లో విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమా షూటింగ్లోనూ జాయిన్ కానుంది.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News